3, నవంబర్ 2021, బుధవారం

గెలుపు ఈటెలదా....? బీజేపీదా...?

 

వ్యక్తి ఎవరైన సరే, వ్యవస్థ ముఖ్యం ఇది బారతీయ జనతా పార్టీ చెప్పుకొనే మౌళిక సూత్రం, సిద్దాంత ఫరంగా జై శ్రీరామ్, హరేక్రుష్ణ అంటూ ఒకరిద్దరు దేవుళ్లని ప్రభలంగా వినిపిస్తూ హైందవమే మా నినాదం అని బహిరంగంగా చెప్పుకొనే పార్టీ, నాడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ నుండి నేటి జే.పి. నడ్డా వరకూ సామాన్యులే మా పార్టీ రథ సారధులు అని చెప్పే పార్టీ, ఒకప్పుడు ఆర్ఎస్ఎస్లో దాని అనుబంద సంస్థల్లో పనిచేసిన వారికే పెద్ద పీట వేసిన పార్టీ, నిన్నటి ఉప ఎన్నికల్లో హుజురాబాద్లో విజయం సాధించింది, ఐతే ఈ గెలుపుకు అభినందించాల్సింది బీజేపీనా....? లేక అక్కడ పోటీ చేసి గెలిచిన ఈటెలనా....? సామాన్యుల మదిని తొలుస్తున్న ఈ ప్రశ్నకు సమాదానం మాత్రం బీజేపీ నాయకత్వానికే ఎక్కువ అవసరం, ఈ ఉప ఎన్నికలకు బీజం పడ్డది ఈటెల రాజేందర్ మంత్రివర్గంనుండి భర్తరఫ్ అయిన తర్వాత, తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించిన తర్వాత, అప్పుడు ఈటెల ఉన్నాడు, బీజేపీ లేదు. తదనంతరం ఈటెల కొంతకాలం వరకూ ఒంటరిగానే ఉన్నాడు అప్పుడూ బీజేపీ లేదు, ఇక తర్జనభర్జనల అనంతరం బీజేపీ గూటికి చేరాడు, కానీ అప్పటి నుండి ప్రచారం ముగిసేంతవరకూ పేరున్న బీజేపీ జాతీయ నాయకులెవరూ హుజురాబాద్ వైపు చూడలేదు, ఈ రసవత్తర పోరు సాగుతున్నప్పుడే నిర్మల్కి వచ్చిన అమిత్ షా, హుజురాబాద్ మీదుగానైనా పోలేదు, తమ పార్టీ నినాదమైన జై శ్రీరాం అన్న మాటని ఒక్కసారి పలుకకుండా హుజురాబాద్లో ఈటెల గెలిచాడు, పార్టీ ముఖ్య నేతలెవరూ మీదేసుకొని  ప్రచారం చేసిన దాఖలాలు లేవు, పార్టీ ప్రచార వ్యూహాల్లో ఎప్పుడూ ఉండే మతం అన్న అంశం వినబడలేదు, పోనీ కేంద్ర ప్రభుత్వ విదానాల గురించి చర్చ జరగలేదు, పదే పదే టీఆర్ఎస్, కాంగ్రెస్ కు సంబందించిన నాయకులు కేంద్ర ప్రభుత్వ విధానాల్ని ఎండగడుతూ హుజురాబాద్ కోసం ఏం చేస్తారు, రైతు వ్యతిరేక చట్టాలపై ఏమంటారు, పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరల్ని ఎలా వెనకేసుకొస్తారు అని బీజేపీని లాగే ప్రయత్నం చేసినా, ఈటెల చాక చక్యంగా ఆ ఊబీలోకి వెల్లలేదు, పార్టీ అనేది జెండా ఎగరడానికి ఊతంగా ఉండే ఊతకర్రే అన్న మాదిరిగా ఏనాడు పార్టీ గురించి చెప్పలేదు, ఓటేయాల్సిన సింబల్గానే కమలం పువ్వు గురించి చెప్పారు. ఇవన్నీ ఎవరు ఔనన్నా... కాదన్నా.... అక్కడ ప్రచారం చేసిన బీజేపీ శ్రేణులకు తెలుసు, ఆ పార్టీ నాయకత్వానికి తెలుసు. ఒక జాతీయ పార్టీగా కేంద్రంలో అధికారంతో పాటు సింహబాగం 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీ, కాంగ్రెస్ పార్టీని సైతం ఉప ప్రాంతీయ పార్టీ అని సంబోదిస్తున్న పార్టీ  ఇవాల ఒక ఉపఎన్నిక కోసం పార్టీనే పక్కన పెట్టి మన గుర్తు గెలిస్తే చాలు అని అనుకొన్నదా....? ఈ ప్రశ్నకు సమాదానం బీజేపీ పెద్దలకు తెలియనిది కాదు. నిజానికి ఈ దశకు బీజేపీ వచ్చి చాలా రోజులే అయింది. 2014లో మోడీని తెరపైకి తెచ్చినప్పుడే అన్ని పార్టీల మాదిరే బీజేపీ సైతం వ్యక్తిపూజకు ఆస్కారం ఇచ్చింది. అనంతరం జరిగిన ప్రతీ ఎన్నికల్లో గెలుపు క్రెడిట్ని పార్టీకన్నా ఎక్కువగా మోడి-షా ద్వయానికే అంటగట్టి వ్యక్తిపూజలోకి మెల్లమెల్లగా ఆ పార్టీ క్యాడర్ని సైతం దించింది. ఇప్పుడు వారికి కావాల్సింది పార్టీ గెలుపా, సింబల్ గెలుపా అనేది ముఖ్యం కానే కాదు. అధికారం. ఎస్ అధికారంలోకి రావడానికి అందుబాటులో ఉన్న ప్రతీ అవకాశాన్నీ వాడుకోవడం, ఇదే బీజేపీ నయా వ్యూహం, బయటకు మాకొక్కరికే సిద్దాంత భావజాలం ఉందని చెప్పుకున్నా, అధికారం కోసం సిద్దాంతాన్ని పక్కన పెట్టడానికి ఏమాత్రం ఆలోచించరని వారిని నిశితంగా గమనిస్తున్న వారికి అవగతమౌతుంది. అధికారంలో ఉన్న హిమాచల్ ప్రదేశ్లో లోక్ సబ స్థానాన్ని కోల్పోయింది, పశ్చిమ బెంగాల్ సహా ఇతర చోట్ల అసెంబ్లీ ఉపఎన్నికల్లోనూ తీవ్రమైన ప్రతికూల గాలి వీచింది 30 అసెంబ్లీ స్థానాల్లో కేవలం 7 మాత్రమే గెలిచింది, ఇలా ఉత్తరాదిని కోల్పోతున్న సంధీ దశలో ఎలాగైనా దక్షణాదిలో పాగా వేయాలి, 2024 ను ఎదుర్కోవాలంటే ప్రస్తుతం ఇంతకుమించిన వ్యూహం బీజేపీకి కనబడట్లేదు, అందుకే పార్టీ అధికారంలోకి రావడానికి మార్గాల్ని వెతకడమే తక్షణ కర్తవ్యం, అందుకోసం ఇతర పార్టీలోంచి వచ్చే వ్యక్తుల్ని అందలమెక్కించడానికి, అవసరమైతే వ్యక్తి పూజ చేయడానికి సైతం బీజేపీ వెనుకాడడం లేదు. కానీ భలమైన నాయకత్వం తమ సొంత వర్గాన్ని ఏర్పాటు చేసుకుంటూ పోతే, తెలంగాణలాంటి ప్రాంతాల్లో మౌళిక సిద్దాంతం ఆదారంగా ఏళ్లకేళ్లుగా పనిచేస్తున్న వారికి పార్టీలో ప్రాదాన్యం సంగతి దేవుడెరుగు ప్రాతినిధ్యం లేని పరిస్థితులు వస్తాయి. అప్పుడు పార్టీనా....? వ్యక్తా....? అన్న ప్రశ్నలు ఉదయిస్తాయి. వీటికి సమాదానం ఖచ్చితంగా ఏదో ఒకటి మాత్రమే అవుతుంది. అప్పటికైనా గెలిచింది ఈటెలా....? లేక బీజేపీనా.....? అనేది ఒక సమాదానంలా నిలుస్తుంది.

28, సెప్టెంబర్ 2021, మంగళవారం

ముంపు - కథ


    
https://www.teluputv.com/sudheer-gangadi-story-mumpu

సన్నటి తుంపర్లతో బయటంతా చిత్తడి చిత్తడిగా ఉంది, ఆ బురదలో ఇంటికి కూతవేటు దూరంలో ఉన్న చికెన్ సెంటర్ నుండి బండిపై చికెన్ తీసుకొస్తుంటే నైట్ పైంట్ పై మొత్తం బురద చిమ్ముతుంది, పైనుండి వాన తుంపర్ల జల్లు, కింది నుండి బురద, మద్యలో రోడ్డు గుంతల్లో పడి నడుం నొప్పితో విపరీతమైన చిరాకు వస్తుంది. ఐనా ఆధివారం ముక్కకు అలావాటైన ప్రాణం ఊరుకోదు కదా... ఇంటి గేటు బయటే బండి ఆపి బాల్కనీలో కాళ్ళతో పాటు చికెన్ కవర్ ను అంటుకున్న కరోనా క్రీముల్ని శుభ్రంగా కడిగి శ్రీమతికి అందజేస్తూ ‘మాంచి చాయ్ ఇవ్వు’ అని ఆర్డరేసి కుర్చీలో కూలబడ్డా....
బయట్నుండి తడిసి రావడంతో చలి మరింతగా ఎముకల్ని మెలిపెడుతుంది. రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఛానళ్స్ మారుస్తుంటే వార్తల్లో చూపిచ్చినవే చూపిస్తూ, ఎంటర్టైన్మెంట్లో పోయినవారం వేసిన సినిమాల్నే వాయిస్తూ ఏ ఛానల్ పెట్టినా విసుగే వస్తుంది. వెంటనే ఫోన్ తీసి కాసేపు ఫేస్బుక్లో తలదూర్చా ‘నాయకుల కుమ్ములాట, నాయికలకు తలపోటా?’ పొట్టి దూస్తుల హీరోయిన్ బొమ్మతో ‘హీరోయిన్ బాత్రూం బాగోతం’ ఇట్లా పోస్టులు కనబడే సరికి ఒక నొక్కు నొక్కా, డ్రగ్స్ కేసులో ఆరోపణల పర్వం ఒకవార్తైతే, మరోటి మరీ దారుణం ముక్కూ మొఖం తెలియని మళయాలీ హీరోయిన్ ఇళ్లు రిపేర్లు చేయిస్తూ బాత్రూం క్లీన్ చేయిస్తే వీపరీతంగా చెత్త వచ్చిందనే చెత్త వార్త. ఒక్కసారి కోపం నషాలానికి అంటింది. వాడు చూపించిన థంబ్ నైల్కి లోపలున్న వార్తకి ఏమన్నా సంబందం ఉందా అని ఆ సైట్ వాడి కాలర్ పట్టుకోని అడగాలనిపించింది. వెంటనే అలా కనిపిస్తేనే గదా కక్కుర్తి పడుకుంటూ నేను చూసింది అని నా థర్డ్ గ్రేడ్ బుద్ది గుర్తొచ్చీ సిగ్గేసింది.
చలి ఎక్కువైతుందనిపించి డోర్ మూయబోతుంటే పక్కనే ఉన్న గుడిసెలోంచి పిల్లాడి అరుపులు విన్పించాయి, వెంటనే కాంపౌండ్ వాల్ దగ్గరికెళ్లి చూస్తే, బయటి చల్లదనానికి పురుగూ పుట్రాతో పాటు పాము బయటకొచ్చి ఆ గుడిసెలోకి దూరిందట. దాన్ని చూసిన పిల్లాడు బయపడి అరిచాడని చెప్పారు వాళ్లు.
హైదరాబాద్ మహానగరంలో ఇంకా పూర్తిగా కాంక్రీట్ మయం కాని ఆల్వాల్లో ఎనిమిదేళ్ల క్రితం ఇంటి జాగా కొని మూడేళ్ల క్రితం కట్టుకున్నాడు భూపాల్, ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ రూపాయి రూపాయి పోగేసిన డబ్బులతో చవకగా వస్తుందని ఆశపడి ఇక్కడ కొన్నాడు. నిజానికి అది అల్వాల్ చెరువు శిఖం ఎప్పుడో ఇరవై ఏళ్ల క్రితమే పూడ్చేసి రాజకీయ నాయకుల అండతో లేఔట్ వేసుకొని అమ్ముకున్నారు, అలా చేతులు మారుతూ మారుతూ, రూపాలు మార్చుతూ మార్చుతూ ప్రస్థుతం మూడు కాలనీలుగా మారిపోయింది ఆ ప్రాంతం. కొనడానికి వచ్చినప్పుడే భూపాల్ భార్య రజిత చెరువుకు దగ్గరగా ఉంటే దోమలెక్కువ, వాసన కూడా వస్తుందని వద్దంది, కానీ చిన్న గుంతను పట్టుకొని చెరువంటావా అని కసురుకొని పక్కనే పదిహేనువేలు పోతుంటే ఆపక్కనే తొమ్మిది వేలది కొనని వాడెవ్వడైనా మూర్కుడే అని వాదించి మరీ తీసుకున్నాడు, అప్పటికీ ఇంత తక్కువకు ఇస్తున్నారంటే ఏదో లోపం ఉంటుందని భార్య మొత్తుకుంటుంటే మొదట సందేహించినా చివరికి కేవలం పదిహేనేళ్ల డాక్యుమెంట్లు చెక్ చేసి ఇచ్చే బాంకు లోన్ రావడంతో అంతా పక్కా డాక్యుమెంట్స్ అని భార్యని గదమాయించి మరీ కొని ఇళ్లు కట్టాడు.
రెండేళ్లు బాగానే గడిచాయి. హాయిగా ప్రశాంత వాతావరణంలో, దూరం దూరంగా ఉండే విశాలమైన ఇండ్ల మద్యలో కాలుష్యం కాటు పెద్దగా లేని, ముఖ్యంగా ఇన్నాళ్లు అద్దెకున్న వారసీగూడలో లాగా చుట్టూ ఏదో బందించి బిగుసుకుపోయిన ఇరుకిరుగు గల్లీలు, అగ్గిపెట్ట లాంటి పిట్టగూడు ఇంట్లో నుండి స్వాతంత్ర్యం పొందినట్టుగా హాయిగా అన్పించింది. ఆఫీస్ కూడా ఇటువైపే మారడంతో దూరం కూడా తగ్గి ట్రాఫిక్ చిక్కులు లేకుండా తొందరగా ఇంటికి చేరుకొని బాల్కనీలో కాలు మీద కాలేసుకొని పేపరు చదువుతూ ఎంజాయ్ చేస్తున్నాడు భూపాల్. అలా ఆనందంగా సాగిపోతున్న కాలంలో గతేడాది నిప్పులు కురిపించింది, కాదు కాదు నీళ్లు గుమ్మరించింది.
చిన్నగా వాన మొదలైన ఒకటో రోజు హాయిగా చల్లని తుంపర్లలో శ్రీమతితో వేడి వేడిగా పకోడీలు, బజ్జీలు చేయించుకొని ఇద్దరూ కల్సి తింటూ మల్లీ తొలినాటి పెళ్లి రోజులకు వెల్లిపోయారు. రెండో రోజు ముసురు కాస్తా ముదిరింది. ఆ వాతావరణానికి ఆఫీసుకు బంకు కొట్టి హాయిగా ముసుగేసుకుందామనిపించినా... అర్జంట్ పనుండడంతో వెళ్లాడు భూపాల్, వెళ్తూ, వెళ్తూ సాయంత్రం త్వరగా వస్తాను ఎలాగూ కరోనాతో మూసిన థియోటర్లు తెరవరు కాబట్టి చికెన్ తీసుకొస్తా మాంచి వెరైటీ చేసుకుందాం అని శ్రీమతితో చెప్తూ వెల్లాడు. సాయంత్రం వచ్చేటప్పటికీ వర్షంతో పూర్తిగా తడిసిపోయాడు, మద్యలో రెండు సార్లు బండి స్కిడ్దయ్యి కిందపడ్డాడు, ఎలాగోలా కిందా మీదా పడి మహానదుల్ని తలపించిన కాలనీ రోడ్లపై సాహసయాత్రను ముగించుకొని ఇంటికి చేరాడు. పూర్తిగా తడిసిన భూపాల్కి ఆవిరి పట్టింది రజిత, వర్షంలో తడవడంతో చలి పెరిగి తొందరగా తిని పడుకున్నారు.
తెల్లారి లేచి పాల పాకెట్ కోసం బయటికొచ్చిన రజిత ఒక్కసారిగా కెవ్వుమని అరిచింది. ఆ అరుపుకు మెలకువొచ్చిన భూపాల్ పరుగెత్తుకుంటూ వస్తూనే ‘ఏమైంది, జారి పడ్డావా’ అని కేకేసాడు. ఇంటి చుట్టూ నీళ్లను చూసి రాత్రి ఎంత వానకురిసిందో అర్థమైంది ఇద్దరికి, జాగ్రత్తగా గేటు బయటకు వచ్చారు. పరిస్థితి చాలా భయానకంగా ఉంది. ఏది రోడ్డో, ఏది కాలువో అర్థం కాకుండా వీది మొత్తం నీళ్లు నిండిపోయాయి. దూరంగా రామారావు వాళ్లు వీళ్లలాగే భయటకొచ్చి చూస్తున్నారు. ‘రామారావు గారూ ఏమైంది, డ్రైనేజీ బ్లాకయిందా నీళ్లన్నీ ఇలా నిలిచిపోయాయి’ అన్నాడు భూపాల్. ఆ వైపు నుండి అరుస్తున్నట్టుగా ‘డ్రైనేజీ బ్లాకవడం కాదు, వాటితో ఈ చెరువు నిండిపోయింది’ అన్నాడు రామారావు. నీళ్ల చప్పుడుకు ఆ మాటలు సరిగి విన్పించలేదు వీల్లకు, సరేలే పద ఇంట్లో కెల్దాం అని వెల్లిపోతుంటే కొత్త ఇళ్లు మొండిగోడలపై కవరు కప్పుకొని కూర్చున్న పక్క గుడిసె శీను, అతని భార్య, కొడుకు కన్పించారు, వెంటనే గుడిసె వైపు చూసాను సగం నీళ్లునిండాయి, వెంటనే ‘ఇన్ని నీళ్లు ఎప్పుడొచ్చాయండి’ అన్నాడు భూపాల్. ‘మద్యరేత్రి నుండే నండి’ అన్నారు వాళ్లు, అంటే అప్పటినుండి అలా బీమ్ పై కవరు కప్పుకొనే కూర్చున్నారన్నమాట అనుకుంటూ ఇంట్లోకి వెల్లారు రజిత, భూపాల్. ఇంకా నయం కరెంటు పోలేదు ముందు పోన్లు చార్జింగ్ పెట్టు అని బాత్రూంలో దూరాడు భూపాల్. వంట చేసిన రజిత పాలకోసం ఎదురుచూస్తుంది. ఆపీసుకు ఎలా వెల్లాలా అని ఆలోచిస్తూ పోన్ తీసుకున్న భూపాల్కి వాట్సప్ ఆఫీస్ గ్రూప్లో విపరీతమైన వర్షాలతో ఆఫీసుకు సెలవు అనే మెసెజీ కనబడడంతో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. టైం పదవుతుంది టిఫినైతే అయింది కానీ చాయ్ తాగక మైండంతా అదోరకంగా ఉంది. ‘ఇక ఈ పాలోడు రాడులే కానీ నేను అలా షాపు వరకెళ్లి పాలుతెస్తాను, ఇంకా ఏమైనా కావాలా చెప్పు, ఈ వర్షం రెండు మూడ్రోజులు తగ్గేలా లేదు’ అని బార్యకు చెప్పడంతో కావాల్సిన సామాన్ల లిస్ట్ ఇచ్చింది.
సామాన్లు తీసుకొని తిరిగొచ్చేసరికి పక్కనే గుడిసెలో ఉండే కుటుంబం తన ఇంటి వసారా నీళ్లలో నిలబడి రజిత ఇచ్చిన ఉప్మా తింటున్నారు. వడివడిగా ఇంట్లోకెళ్లిన భూపాల్ ‘ఏంటీ వాళ్లు ఇక్కడ తింటున్నారు’ అన్నాడు. ‘పాపం రాత్రినుండి అలాగే ఉన్నారండి, ఆకలౌతుంటుంది కదా, ఇస్తే వర్షంలో తినలేరు కదా... ఇంట్లోకి రమ్మన్నా రాకుండా బాల్కనీలోనే తింటున్నారు’ అంది రజిత. ‘నీకేమైనా బుద్దుందా ఓవైపు కరోనా మరోవైపు వర్షం ఎన్నిరోజులుంటుందో తెలియదు, ఇప్పుడు వాల్లు ఎక్కడ ఉంటారు’ అని కసురుకున్నాడు. ‘అబ్బా కాస్త టిఫిన్ పెట్టిస్తే మనింట్లోనే కాపురముంటారా.. వర్షం తగ్గాక వెల్తారులెండి’ ‘ఉన్నది ఇద్దరమే కదా, వాళ్లూ ముగ్గరే కదా ఆ రూములో ఉంటారు లేండి, ఐనా మెల్లగా మాట్లాడండి వాళ్లు వింటే బాదపడుతారు’ అని భూపాల్ని కసురుకుంటూనే చాయ్ పెట్టడానికి వెల్లిపోయింది. భూపాల్కి ఏం చేయాలో అర్థం కాలేదు. చాయ్ తీసుకొని వచ్చిన రజిత తనకొ కప్పు ఇచ్చి వాళ్లకు ఇవ్వడానికి బయటకెల్లింది. రజితను చూస్తూనే ఇబ్బంది పడుతూ చాయ్ తీసుకున్నారు. ‘అమ్మా తుఫానంట గదా... ఇంకో రెండు మూడ్రోజులుంటదేమో... ఇంతకు ముందు వరదలొచ్చినప్పుడు గవర్నమెంటోళ్లు బళ్లో ఉంచారండి ఇప్పుడు కూడా ఆడికే బోతామమ్మ’ అన్నది చాయ్ కప్పులు కడుగుతూ, లోపల భూపాల్ అన్న మాటలు విన్నారేమో అని ఒక్క క్షణం నొచ్చుకుంది రజిత, వెంటనే తేరుకొని ‘రేపటి వరకు వాన తగ్గుతది గావచ్చు, ఈ ఒక్కపూటకు ఏం తిరుగుతరు, ఈ రూములో ఉండండి’ అంది. ‘ఏమో అమ్మా ఈ వాన ఒక్కరోజులో పోయేటట్టు లేదు, మీకెందుకు కట్టం. ఉకుమ పెట్టి చాయ బోసిండ్రు, మీ కడుపు చల్లగుండా’ అని నెత్తిమీద బట్టల ముల్లె పెట్టుకొని బయల్దేరిండ్రు. వాళ్లను చూసుకుంటూ జాలీ పడి నిట్టూర్చుతూ లొపలికెల్లింది రజిత.
సమయం గడుస్తున్నా కొద్ది వాన ఇంకా పెరుగుతుంది. బీభత్సంగా శభ్దం చేస్తూ వీస్తున్న గాలి చప్పుడుని టీవీ సౌండ్ డామినేట్ చేస్తుంది, అలా టీవీ చూస్తూ గడుపుతున్న భూపాల్, రజితలకు మద్యాహ్నం రెండింటికి కరెంటు పోయి చార్జింగ్ లైట్ ఆన్ అవడంతో ఇల్లంతా నియాన్ లైట్ల వెలుతురు పోయి ఏదో గుడ్డి దీపం వెలుగుతున్నట్టుగా అయింది. ‘అనుకున్నా, ఇంకా కరెంటు పోవట్లదేంటా అని, పోన్లు ఫుల్లు చార్జింగైతే ఉన్నయ్’ ఇంకేం దీమా వద్దు అన్నట్టుగా అన్నాడు భూపాల్. వెల్తురు కోసం డోర్ ఓఫెన్ చేసే సరికి నీటి మట్టం కడపను తాకుతున్నాయ్. ఒక్కసారిగా గుప్పుమని డ్రైనేజీ వాసన దూసుకొచ్చింది. ముక్కు మూసుకుంటూనే ‘వామ్మో ఏంటీ కంపు, దయ్యం వాన మోపైంది, ఎప్పుడు తగ్గుతుందో ఎమో, ఇంకాసేపైతే నీళ్లు ఇంట్లోకొచ్చేలాగ ఉన్నాయ్’ అంటుండగానే అక్కడికి వచ్కిన రజిత ఆ నీళ్లను చూసి చాలా భయపడింది. ‘ఏంటీ అసలు మనం ఇంట్లో ఉన్నామా, చెరువులో ఉన్నామా,’ అనుకుంటూ వెంటనే ఇంట్లోకి నడిచి ప్లోర్ పైన నానితే పాడయ్యే అన్ని వస్తువుల్ని పైన షెల్పుల్లోకి సర్దుతుంది, భూపాల్ని కూడా పెద్ద వస్తువులన్నింటిని పైన సజ్జపైన పెట్టమని పురమాయించింది. ‘ఏహే మరీ నీ కంగారు, నీళ్లు కడపను దాటి ఇంట్లోకొస్తాయా అన్నాడు’ ‘ఏంటీ ఇంకా అర్థమవడం లేదా... మనిళ్లు నడి చెరువులో కట్టింది. రోడ్డుకు నాలుగు అడుగుల పైన ఉన్న కడప దాకా వచ్చిన నీళ్లు ఇంకొక్క అడుగు పెరుగుతే చాలు ఇళ్లంతా నీళ్లలో మునిగిపోవడానికి’ అని తొందరపెట్టింది,
అలా అన్నీ సర్దారు, ఆ వాసన భరించలేక ఆరునెలల క్రితం వాడడం మానేసిన మాస్కుని తీసి తగిలించుకొన్నాడు భూపాల్, ఐనా తగ్గకపోవడంతో తన డియో తీసి ఇళ్లంతా కొట్టాడు, ఈలోగా చార్జింగ్ ఐపోవడంతో లైట్ ఆగిపోయింది, ఐదింటికే ఇళ్లంతా చీకట్లు కమ్ముకున్నాయి, ఏదో ఉన్నది తిని నిద్రకు ఉపక్రమించారు, భయంతో నిద్ర సరిగా రాక మద్యలో లేచి ఎలా ఉందో చూద్దామని అనిపించి భూపాల్ని లేపడానికి ప్రయత్నించింది రజిత. నిద్రలో అటూ ఇటూ కదిలాడు కానీ లేచి రాలేదు భూపాల్, అలా తెల్లారిపోయింది, కొంచెం వెలుతురు రావడంతో లేచి వచ్చి చూస్తే హాలంతా నీళ్లు నిండిపోయాయి. మెల్ల మెల్లగా బెడ్రూంలోకి వస్తున్నాయి. భయట వాన మాత్రం తగ్గడం లేదు. భూపాల్ తొలిసారి ఇంట్లో మురికినీళ్లను చూసి నిలువెల్లా వణికిపోయాడు. అప్పటివరకూ బింకంగా ఉన్న భూపాల్ బేలగా మారిపోయాడు, భయంగా ఉన్న రజిత భూపాల్ పరిస్థితిని చూసి ముందుగా తేరుకొని టీ పెట్టిచ్చింది. ఇంట్లో అత్యవసరంగా వాడాల్సిన వాటిని తీసి అందుబాటులో సర్దుకుంది. ముందు జాగ్రత్తగా అన్నీ తీసి సర్దుకున్నారు కాబట్టి పెద్ద నష్టం ఏం జరగలేదు,
ఆ నీటిని తోడిపోయ్యడానికి ట్రైచేస్తున్నాడు బైటికి పోస్తున్న నీళ్లు మరింత కుళ్లులయి ఇంట్లోకి వస్తున్నాయి, ఇంతలో బయట రోడ్డుపై కలకలం చెలరేగింది. బయటకి వెల్లి చూస్తే కాలనీ వాసులంతా ఉన్నారు, నీళ్లలో భయం భయంగా వెల్లారు ఇద్దరు, ‘కార్పోరేటర్ దగ్గరికి వెల్దాం మొన్నట్నుంచి వానలో మునుగుతుంటే, ఎవరూ పట్టించుకోరా’ అని కోపంగా అంటున్నాడు ఓ యువకుడు, ఆడాళ్లు కొంత మంది వంత పాడారు, ‘కార్పోరేషన్ వాళ్లు ఎక్కడ చచ్చారు, ఒక్కరన్నా వచ్చి వాటర్ క్లియర్ చేయరా’ అని ఇంకొకరు అరిచారు, ‘ఫోన్ చేసామండి, ఫుడ్ పాకెట్లు పంపుతారంటా’ అన్నారు పెద్దాయన, ‘పుడ్ పాకెట్లు ఎవరిక్కావాలి, మనుషులు చస్తుంటే’ మరొకరి ఆక్రందన ‘ఐపిఎల్ వస్తుంటే కరెంట్ తీసేసారు, ఎప్పుడొస్తుందంటా’ అన్నారు యువకులు. ‘ఎవరు మాత్రం ఏం చేస్తారు హైదరాబాద్ మొత్తం బీభత్సంగా వానలు, లోతట్టు ప్రాంతాలన్నీ మునిగాయట’ ‘మనది లోతట్టు కాదు లోచెరువు’ అన్నారు మరికొందరు. ‘బొల్లారం హైస్కూళ్లో పునరావాసం సెంటర్ ఏర్పాటు చేసారంటా, అక్కడికి వెళ్లమన్నాడు కార్పోరేటర్’ అన్నాడు కాలనీ ప్రెసిడెంట్. ‘అదేంటండీ, ఇళ్లు, వాకిలీ వదిలి పునరావాసంకు పోవడానికి మనమేమన్నా శ్రీలంక శరణార్థులమా’ అన్నాడు అపోజిషన్ పార్టీ సింపథైజర్. ఇలా ఎవరికి తోచింది వారు మాట్లాడుతున్నారు.
ఇంతలో కొంచెం దూరంలో పాడుబడిన పాత ఇళ్లు అందరూ చూస్తుండగానే ఒక్కసారిగా కూలిపోయింది. అంతా హహాకారాలు పెడుతూ పరుగులు తీసారు, ఆ కాలనీకి కొత్తగా వచ్చిన వ్యక్తి ఉరుకుతూ డ్రైనేజీ కోసం తీసిన గుంతలో పడిపోయాడు, అందరూ కలిసి అతికష్టం మీద అతన్ని బయటకు తీసి జాగ్రత్తగా ఉండొద్దు, సహాయం చేయడానికి కూడా కాదు ఊరికే చూడడానికే ఎందుకంత ఆత్రం అని కొప్పడ్డారు, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాప్రాయం తప్పింది. ఈ గండం నుండి బయటపడడానికి కొందరు సొంతూరికి, ఇంకొందరు బందువులింటికి, మరికొందరు పునరావాసం సెంటర్లోకి వెళ్తున్నారు, రెండు రోజులు చూద్దాంలే అని ఇంట్లోకి వచ్చారు భూపాల్, రజితలు. గాలి వాన పెట్టినప్పుడల్లా కరెంట్ తీగలపై పడ్డ కొమ్మల్ని సరిచేస్తూ రోజులో కొన్ని గంటలు కరెంటు ఇస్తున్నారు, ఏదో ఓ టైంలో కార్పోరేషన్ వాళ్ల పుడ్ పాకెట్ల వాన్ తిరిగిపోతుంది. వర్షం కొంచెం తెరిపిచ్చింది కానీ అప్పటికీ ఇంటిలోపలే పడవలతో తిరిగేన్ని నీళ్లు నిండిపోయాయి.
ఊరెల్దామంటే రోడ్లన్నీ కొట్టకుపోయి బస్సులు తిరగడం లేదు, హైదరాబాద్లో బందువులు లేకపోవడం, తెలసిన వాల్ల ఇంటికి వెల్లి ఇబ్బంది పెట్టడం ఎందుకని మరో రోజు అలాగే ఉన్నారు, నరకంలో ఉన్నట్టే ఉంది, కరెంటు స్విచ్చులేయాలంటే భయం వేస్తుంది. గోడలన్నీ నానిపోయి ఉన్నాయి ఇద్దరూ షార్ట్ నిక్కర్లు వేసుకొని తిరుగుతున్నారు, కానీ ఇళ్లంతా ఒకటే వాసన, సరిగ్గా అప్పుడే పునరావాస సెంటర్నుండి పాలపాకెట్టు, పండ్లు తీసుకొని పక్క గుడిసెలోని బిల్డింగ్ పనిచేసే శీను కొడుకు తెచ్చిచ్చాడు. అతన్ని చూస్తూనే భూపాల్కి సిగ్గనిపించింది. ‘అమ్మ ఇవిచ్చి రమ్మన్నారండి, ఇక్కడ ఏమైనా దొరుకుతున్నాయో లేదోనని’ అన్నాడు. రజిత వాటిని తీసుకుంటూ ‘అమ్మవాళ్లు ఎలా ఉన్నారు’ అని అడిగింది. ‘బాగున్నారండి అంటూ వెళ్తూనే, అక్కడ బాగానే ఉంది అమ్మగారూ, ఈ కంపులో ఉంటే ఏమైనా రోగాలొస్తాయోమో రండి’ అన్నాడు. ఆ మాటల్తో ఇగ ఆగలేకపోయిన రజిత ‘మీరు వస్తే రండి లేదంటే లేదు, నేను వెళ్తాను అని ఖరాఖండిగా చెప్పింది. కానీ పునరావాస సెంటర్లో ఇంతకంటే దరిద్రంగా ఉంటుందని ఇన్ని రోజులూ భయపెట్టిన భూపాల్కి ఇక వెల్లక తప్పలేదు, ఇద్దరూ రెండు జతల బట్టలు తీసుకొని బొల్లారంకు భయల్దేరారు.
లోపలికెళ్తూనే వారూహించుకున్నదానికి భిన్నంగా అక్కడ వాతావరణం ఉంది, చెత్తా చెదారం లేని పరిసరాలు, అంత నీటుగా లేకున్నా చంఢాలంగా లేని వంట గది, ప్రభుత్వ బడి కావడంతో విశాలంగా ఉంది, ఒక్కో తరగతి గదిలో పది బెడ్లను ఏర్పాటు చేసారు, ఓ వందమంది దాకా ఉన్నారు మొత్తం పది రూములున్నాయి. అందరూ దిగువ మద్యతరగతి, పేద వాళ్లే, ప్రతీ ఒక్కరూ భాద్యతగా ఉన్నారు, కొంచెం బాత్రూం పరిసరాల్లో నీరు నిండి బురద కన్పిస్తుంది కానీ గత రెండ్రోజులుగా ఇంట్లో పలుకరించే మానవులు లేక, కుళ్లి కంపుకొడ్తున్న పరిసరాల్లో తినబుద్దవక ఉన్న దిగులు రజిత, భూపాల్లకు క్రమక్రమంగా పోయింది, ఎవరో కొందరు మాకు ఇది లేదు, అది లేదు అని తిన్నదరక్క గొడవ పడడం మినహా మిగతావాళ్లంతా భవిష్యత్ పై గంపెడాశతో ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కో భాద, కానీ ఎవరినీ నిందించడం లేదు, పనే దైవంగా బతికే మనుషులు కాబట్టి కుదురుకునే రోజుల కోసం ఎదురుచూస్తూ కాలక్షేపం కోసం తమ గాథల్ని వినిపిస్తున్నారు, కొందరు దేవుడు పగబట్టాడు అందుకే కుండపోతలు కురుస్తున్నాయి అన్నారు, మరి కొందరు మరైతే గప్పుడెప్పుడో ఓ సీఎం ఉన్నప్పుడు వర్షాలే పడక కరువొచ్చింది కదా... అప్పుడు పగబట్టిన దేవుడేనా అన్నారు కొంచెం రాజకీయాల మీద ఆసక్తి ఉన్నావాళ్లు. ఇలా తలా ఒక మాట మాట్లాడుతుంటే అక్కడున్న అందరికీ కొంచెం నిమ్మళమైతుంది, ఇంతకాలం నా డబ్బు, నాకుటుంబం అనుకుంటున్న భూపాల్కు నిజమైన ప్రపంచం ఏంటో కొంచెం కొంచెం అర్థమవుతుంది, మొదటినుండి పదిమందికి సహాయం చేసే రజితే కాదు భూపాల్ కూడా అక్కడి వారికి ఆహారం అందించడం, ప్లేట్లు తీయడం, చుట్టుపక్కలను నీటుగా ఉంచడం వంటి పనులు చేస్తున్నాడు.
మిన్నువిరిగి మీదపడే వానకు ఎవరేం చేస్తారు, చెరువుల్ని కాపాడి, కాలువలను ఆక్రమించకపోతే ఎక్కడి నీళ్లు అక్కడే వెళ్లిపోయేవి కానీ ఎవరి స్వార్థానికి వారు అడ్డదిడ్డంగా ఆక్రమణలు చేసారు, తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు అందరిదీ తప్పే, అందుకే ఈ ఇక్కట్లు అని వారు మాట్లాడుతుంటే ఇంత సాత్వికంగా బతికే నైజం, కష్టాల్లోనూ సంతోషంగా ఉండడం తెలిసిన వీళ్లే నిజమైన అద్రుష్టవంతులు అనుకున్నారు రజిత, భూపాల్లు, మొత్తానికి మూడు రోజుల్లో వరద తగ్గి ఎవరింటికి వారిని పంపిస్తున్నారు. ఉన్న మూడ్రోజుల్లోనే వారందరూ తమకు ఆత్మభందువులయ్యారు, అందరి దగ్గరా ఆప్యాయంగా సెలవు తీసుకొని, ఇంటికొస్తుంటే కొన్ని కాలనీల్లో తాళలేసిన ఇళ్లలో ఇదే సందుగా దొంగలు పడి దోచుకుపోయిన ద్రుశ్యాలు కన్పించాయి, గాబరా పడుతూ ఇంటికి చేరుకునే సరికి తాళం కప్ప భద్రంగా కన్పించడంతో కుదుటపడ్డారు, బురదంతా ఎత్తిపోసి మామూలు స్థితికి చేరుకున్నారు, భూపాల్ ఆపీస్ కూడా స్టార్ట్ అవడంతో వెల్లాడు, సాయంత్రం వచ్చేటప్పుడు రెండు కూరగాయల సంచులు తెచ్చాడు, ఒకటి తీసుకెళ్లి పక్క గుడిసెలో ఉండే శీనుని పిలిచి ఇచ్చాడు, ఇవ్వడంలోని ఆనందాన్ని ముంపుతో తెలుసుకొన్నాడు భూపాల్. ప్రతీ సంక్షోభం ఓ అవకాశానికి ఓ మార్పుకు దారితీస్తుందని పెద్దలంటారు కదా అలా....
అలా గత ఆలోచనల్లో ఉన్న భూపాల్కి టీ కప్ అందిస్తూ ‘ఏంటండీ ఆలోచిస్తున్నారు’ అంది రజిత, ‘వర్షం తీరు చూస్తుంటే మళ్లీ ముంపు తప్పేలా లేదు’ అన్నాడు భూపాల్. గతానుభవాన్ని గుర్తుతెచ్చుకుంటూ ‘భయపడ్తున్నారా’ అంది, ‘కానీ ఇప్పుడు మునిగే అవకాశం రాకపోవచ్చు, పోయినసారి వరదలప్పుడు తీసిన వరద కాలువ నీళ్లను తోడేస్తుందిలే’ అన్నాడు. ‘దాన్ని మించిన వానపడితే అదేం చేస్తుంది లేండి’, ‘ఏం చేస్తాం కక్కుర్తికి పరిష్కారం చేసుకోవాల్సిందేగా.... ఐనా మరో మంచి పాఠమేదో నేర్పుతుంది లేండి’ అంది. ఇద్దరూ నవ్వుకున్నారు.

26.09.2021
May be an image of tree and lake
You, Revathi Reddy Gangadi, Srikanth Reddy Gangadi and 74 others
32 Comments
30 Shares
Like
Comment
Share

19, జులై 2021, సోమవారం

దుస్సాహస యాత్ర

ఏడ నుండి ఏడికి మన ప్రస్థానం
మహా ప్రస్థానాలే చిన్నబోయేలా ఎందుకీ దుస్సాహసం
దోపిడీకి, దొరతనానికి...., వంచనకు, వక్రీకరణలకు ప్రతీకలు వాళ్లు
పీడనకు, బానిసత్వానికి ఎదురెళ్లాం మనం
రోదనలు, ఆక్రందనలు దాటి స్వేచ్చా పతాకాలెగరేసాం
కష్టమో, నష్టమో, కలిమో, లేమో సు:ఖమో, దు:ఖమో మన కాళ్లపై ఇప్పుడిప్పుడే నిలబడుతున్నాం
మరేమైంది మన విచక్షణ
మరెక్కడిదీ ప్రేళాపణ
నేడు చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే గుంటనక్కల పంచన ఎలా చేరదాం
నాడు పెద్ద మనుషుల ఒప్పందం పేరు చెప్పి మన నడ్డీ విరిచిన గతాన్నెలా మరుద్దాం
మంచితనమా.... అతిమంచితనమా.... లేక కొందరి అవకాశ రణమా.....
ఎక్కడిదీ దుర్బుద్ది, ఏమిటి ఈ దురవస్థ, ఏ చీకట్లోకి ఈ నినాదం
అవును అతను చేశాడు
ఎంతో కొంత చేశాడు
ఎక్కడ్నుంచి చేశాడో మనకెందుకు
ఎనకటోనికన్నా ఎంతో కొంత చేశాడు
అవును అతను పాలితుడు
మనం పాలితులం.....
సంక్షేమం మాటున అతని కోశాగారం ఎంత నిండిందో తెల్వదు కానీ
ఎంత కొంత మన ఆయాసం తీరింది, భారం తగ్గింది
కానీ....
దేనికోసమైతే శ్వాసను ఉగ్గబట్టుకొని మన బిడ్డలు ఉరికొయ్యలు ఎక్కారో...
దేనికోసమైతే తరాలుగా పోరాటాలనే వారసత్వంగా తండ్రులు అందించారో....
ఆ నినాదం కాదు కదా.... తెలంగాణ అనే పేరునే అతను ఈసడించాడు.
అవసరమైతే కొన్నాడు, అడ్డొస్తే తన గతాన్ని రుచి చూపించాడు...
మొత్తానికి నేతల్ని వశబర్చుకొని విజేతయ్యాడు.
పద్నాలుగు సొరంగాల్లోంచి క్రుష్ణమ్మను తరలించాడు
పదివేల వెంచర్లతో బాగ్యమ్మను అమ్మేసాడు
అన్నింటికీ మించి తెలంగాణ అన్న పదమే నిషేదించాడు
ఈ వారసత్వమేనా మనకు కావాల్సింది
దీనికోసమా మనం పోరాల్సింది
ఏడి నుండి ఏడకు బోదాం
ఏది మన ఐలమ్మ రోషం
ఏది మన బీమన్న రక్తం
జై తెలంగాణ..... జై జై తెలంగాణ
అందరూ అనొచ్చు
కానీ దాని సర్వహక్కులూ నావే
ఈ గడ్డపై పుట్టి ఈ గడ్డలో కలిసే నావి మాత్రమే.....

14, జూన్ 2021, సోమవారం

గురువు బిక్ష

 

పద్మవ్యూహమైన ప్రపంచంలోకి

అమ్మగర్బంలోంచి అభిమన్యుడి అంశతో భయల్దేరానూ....

ఏది మంచో... ఏది చెడో...

ఏది ఒప్పో... ఏది తప్పో....

ఏం చేయాలో... ఏం చేయకూడదో....

తెలియకుండానే ప్రయాణం సాగేదేమో....

కానీ

నాకొక మార్గదర్శనం దొరికింది

నాదారి పోడువునా చీకట్లను పారద్రోలే కాంతి ఫుంజం మెరిసింది

అప్పుడే విచ్చుకున్న నా కళ్లకు

ఉదయకాంతిని చూపించే  చదువుల భానుడు ఎదురొచ్చాడు

గురువు దొరికాడు

గురుతర భాధ్యతల్ని తను తీసుకొని నన్ను మలిచాడు

గతి తప్పని ఆలోచనలని

వక్ర మార్గమెరగని ఆచరణని

సమాజంలో నా సుస్థిరతని

తానే స్థిర పరిచాడు

ఆదిప్రణవమైన అ ఆ...లు మెదలు

అనంతమైన సంగతులు బోదించాడు

రూపంలేని నా స్వరూపానికి

శిల్పిలా...కుంచెలా....పాళిలా...

కమ్మరి కొలిమిలా... కుమ్మరి చక్రంలా... చేనేత రాట్నంలా...

నన్ను తీర్చిదిద్దాడు....

అభిమన్యుడి అసంపూర్తి నుండి

పార్థుని పరిపూర్ణం వరకూ

పద్మవ్యూహం చేదించి భ్రతుకు బండిని సాగించే వరకూ..

గురువుల బిక్ష నా ఈ కక్ష్య

గురువుల బిక్ష నాలో ప్రజ్ణ

గురువుల బిక్ష నేనే ఇంకా.....

గురుదేవోభవ, ఆచార్యదేవోభవ

అమరత్వదేవోభవ ఆచార్యదేవోభవ

ఇటు వైపు చూస్తోంది.

 

సార్వభౌమత్వం స్వాభిమానం

ఇవి జంటపదాలో... ద్విపదులో....

జాతి గర్హాలో... గర్వాలో... గర్జనలో....

నేడివి చర్చనీయాంశాలు... చైతన్య ప్రవాహాలు...

విశ్వమానవ కళ్యాణానికి

విశ్వగురూ వికాసానికి

విశ్వ వైప్లవ్య ప్రభోదానికి

విశ్వజనీన అంశీభూతం నా దేశం

అందుకే....

విశ్వమంతా నా దేశం వైపు చూస్తుంది

కరోనాసుర అంతం కోసం కంటైనర్లలో తరలొస్తున్న వ్యాక్సిన్ బుడ్డీల కోసం

విశ్వమంతా నా దేశం వైపు చూస్తుంది

దేహాలనే కర్షక క్షేత్రాలుగా చేసి హలాలనొదిలి రాజదాని గుడారాల్లో చేరిన రైతు న్యాయాల కోసం

విశ్వమంతా నా దేశం వైపు చూస్తుంది

ఆరుగాలం అన్యాయాన్ని ఆపమని నినదిస్తుంటే నిద్దరోయిన సెలబ్రిటీ పట్టు పరుపుల కోసం

విశ్వమంతా నాదేశం వైపు చూస్తుంది

విశ్వమానవుడి స్పందనలపై అఘమేఘాలై విరుచుకుపడుతున్న స్వార్వబౌమ సింహాల కోసం

విశ్వమంతా...

నాదేశం వైపు చూస్తుంది

నాదేహం వైపు చూస్తుంది

నా మోసం వైపు చూస్తుంది

నా కంచెల వైపు చూస్తుంది

నా కట్టుబాట్లని చూస్తుంది

నాపై కమ్మిన ఉగ్రవాదం వైపు చూస్తుంది

నాపై వేసిన అభాండాలను వింటుంది

నేనే లేకుండా చేసే కుట్రకోణాల్ని కంటుంది

స్వాభిమానమో.... సార్వభౌమత్వమో...

నన్నే లేకుండా చేస్తానంటే....

నా ఉనికినే ప్రశ్నిస్తుంటే....

నా నరాల్లో రక్తపు దారులకు నరమేదాన్ని అంటించాలనుకుంటే...

నా పొలాల్లో పారే నీళ్లకు కార్పోరేట్ సాంద్రతను చేకూరుస్తుంటే....

అసంఘటిత రంగమే కదా....

అడిగే వాడెవడనుకుంటే...

గడ్డిపరకలు ఒక్క చోట చేరి పురితాళ్లను పేనుతున్నాయ్

చలి చీమలు దారిని వెతుక్కుంటూ దడిలా గడీని కడుతున్నాయ్

అది ఉరితాడు కావాలో.... జంద్యమే కావాలో...

సమాదులే కావాలో.... కోటలా మారాలో....

తేల్చుకోవాల్సింది మీరే

మీరంటే కీడు చట్టాలు చేసే పాలకవర్గాలే కాదు

అన్యాయం వికటాట్టహాసం చేస్తున్నప్పుడు

నోరుమూసుకున్న నయవంచకులు

అబాగ్యుని ఏకాకిని చేసేందుకు

దండుకట్టిన దగుల్బాజీలు

మన బిడ్డలే కదా.... ఇకనైనా స్పందిద్దాం

ముళ్లకంచెలతో కాదు మనసు చంచలంతో ఆదరిద్దాం

నష్టనివారణకోసంకాదు నలుపు మచ్చ రాకుండా చూద్దాం

జై కిషాన్ జై హిందుస్థాన్.